న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం భారీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆజాద్ మార్కెట్ ప్రాంతంలోని అండర్పాస్లో ఒక బస్సు చిక్కుకుంది. (Bus trapped) నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), అగ్నిమాపక దళం, పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. వర్షం నీటి వల్ల వంతెన కింద చిక్కుకుని నిలిచిపోయిన బస్సులోని ప్రయాణికులను రక్షించారు. తాళ్ల సహాయంతో నీటి నుంచి బయటకు తెచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఢిల్లీ రవాణా శాఖ మంత్రి ఈ సంఘటనపై స్పందించారు. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అండర్పాస్లలో నీరు నిలిచి బస్సులు చిక్కుకునే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బృందాలను అన్ని చోట్లకు పంపినట్లు వెల్లడించారు.
Wall Collapse
మరోవైపు ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలిపోయింది. తాత్కాలిక గుడిసెల్లో నివసించే ముగ్గురు కార్మికులు లోతుగా తవ్విన గోతిలో పడి చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కూలీలను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
#WATCH | Delhi: Visuals from Azad Market underpass as passengers being rescued from a bus stuck here due to severe waterlogging. pic.twitter.com/Xuuv8D0tnI
— ANI (@ANI) June 28, 2024