BSP | న్యూఢిల్లీ, జూన్ 30: ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో అధికారం చేపట్టిన పార్టీ.. దేశంలో ఒక వెలుగు వెలిగిన పార్టీ.. దళితుల పార్టీగా పేరుపొందిన మా యావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) యూపీతోపాటు దేశంలో ఎక్కడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
ఓటింగ్ షేర్ కూడా 2.04 శాతానికి పడిపోయింది. దీంతో త్వరలో జాతీయ హోదా కోల్పోయే స్థితికి ఈ పార్టీ వచ్చింది. ప్రసుత్తం దేశంలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆప్, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)లకు జాతీయ పార్టీ హోదా ఉన్నది. కాగా, బీఎస్పీని 1984లో కాన్షీరాం స్థాపించగా.. 1997లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. బలమైన శక్తిగా ఎదిగిన బీఎస్పీ.. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి క్రమంగా ప్రభను కోల్పోయింది.