Bridge Collapsed : బిహార్లోని అరారియ జిల్లాలో బాక్రా నదిపై నిర్మించిన బ్రిడ్జిలో కొంత భాగం కుప్పకూలింది. బ్రిడ్జి కూలిన ఘటనపై సిక్తి ఎమ్మెల్యే విజయ్ కుమార్ స్పందించారు.
నిర్మాణ సంస్థ యజమాని నిర్లక్ష్యంతోనే వంతెన కూలిందని ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
#WATCH | Bihar | A portion of a bridge over the Bakra River has collapsed in Araria pic.twitter.com/stjDO2Xkq3
— ANI (@ANI) June 18, 2024
రూ. 12 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభానికి నోచుకోకుండానే కుప్పకూలింది. అరారియ జిల్లాలోని సిక్తి, కుర్సకట్టా బ్లాక్లను కలిపేందుకు భారీ వ్యయంతో పదరియా బ్రిడ్జిని నిర్మించారు.
Read More :
Priyanka Gandhi | వయనాడ్ బరిలో ప్రియాంక గాంధీ : రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు