BJP’s fact-finding team : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై అధ్యయనం చేసేందుకు.. బీజేపీ నియమించిన Fact-finding team (నిజనిర్ధారణ బృందం) తన నివేదికను సమర్పించింది. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ టీమ్ తమ నివేదికను అందజేసింది.
అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య పరస్పర దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడులకు మీరే కారణమంటే, మీరే కారణమంటూ రెండు పార్టీలు పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నాయి. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ ఆ హింసాత్మక ఘటనలపై అధ్యయనం కోసం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో నిజనిర్ధారణ బృందాన్ని నియమించింది. పనిపూర్తిచేసిన బృందం ఇవాళ పార్టీకి తన నివేదికను సమర్పించింది.