Bhartruhari Mahtab | 18వ లోక్సభ (18th Lok Sabha) తొలి సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ (pro tem Speaker)గా భర్తృహరి మహతాబ్ (Bhartruhari Mahtab) ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ఆయన చేత ప్రమాణం చేయించారు. మరోవైపు ప్రొటెం స్పీకర్ అంశంపై అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి మధ్య వివాదం కొనసాగుతోంది.
#WATCH | Delhi: BJP MP Bhartruhari Mahtab takes oath as pro-tem Speaker of the 18th Lok Sabha
President Droupadi Murmu administers the oath pic.twitter.com/VGoL5PGEkT
— ANI (@ANI) June 24, 2024
లోక్సభ ప్రొటెం స్పీకర్గా ఏడు సార్లు ఎంపీగా ఎన్నికైన భర్తృహరి మహతాబ్ను నియమించినట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల చేసిన ప్రకటనపై ఇండియా కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భర్తృహరి కంటే కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ సీనియర్ అని, దళితుడైనందు వల్లే సురేశ్కు ప్రొటెం స్పీకర్ పదవి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. విపక్షాల ఆరోపణలపై కిరణ్ రిజిజు స్పందిస్తూ ప్రొటెం స్పీకర్గా మహతాబ్ ఎంపికను సమర్థించుకున్నారు. మహతాబ్ వరుసగా ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారని, సురేష్ అలా కాలేదని చెప్పారు. సురేశ్ 2004 ముందు నాలుగుసార్లు, ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ అంశం లోక్సభ సమావేశాల్లో హాట్ టాపిక్గా మారే అవకాశం కనిపిస్తున్నది.
కాగా, ఈ సమావేశాల్లో లోక్సభ ఎన్నికల్లో కొత్తగా ఎంపీలుగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. 24, 25 తేదీల్లో వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అనంతరం 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ జూన్ 28న ప్రారంభం అవుతుందని, ప్రధాని మోదీ జూలై 2 లేదా 3న చర్చకు సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నదని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల తర్వాత స్వల్ప విరామం అనంతరం జూలై 22న పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఉభయ సభలు తిరిగి సమావేశం కానున్నాయని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.
Also Read..
Nara Lokesh | మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్
Nagarjuna | అభిమానికి హీరో నాగార్జున క్షమాపణ.. ఎందుకంటే?
KTR | చరిత్ర పునరావృతం అవుతుంది.. అధికారంలో ఉన్నవారికంటే బలంగా ప్రజల శక్తి: కేటీఆర్