Ayodhya | న్యూఢిల్లీ, జూన్ 6: కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీ దారుణంగా దెబ్బతిన్నది. 2019లో యూపీలో 62 స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. ఈసారి కేవలం 33 స్థానాలకు పరిమితమైంది.
అయోధ్య రామమందిరం నిర్మాణం జరుపుకున్న ఫైజాబాద్ స్థానంలోనూ బీజేపీ ఓడింది. ‘అభ్యర్థుల ఎంపికలో సీఎం యోగి ఆదిత్యనాథ్ను పార్టీ అధిష్ఠానం పక్కకు పెట్టింది. ఈ అంశం ఆర్ఎస్ఎస్లో చర్చనీయాంశమైంది. రాష్ట్ర నాయకత్వం అభ్యంతరం తెలిపినప్పటికీ, 62 సిట్టింగ్ స్థానాల్లో 55 మందికి హైకమాండ్ తిరిగి టికెట్లు ఇచ్చింది’ అని యూపీ బీజేపీ నాయకుడు ఒకరు మీడియాతో చెప్పారు.