NEET Paper Leak : నీట్ ప్రశ్నాపత్రం లీక్పై బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు చేపడతామని, దీనిపై తాము కఠిన చట్టం తీసుకొస్తున్నామని, భారత ప్రభుత్వం కూడా చట్టంలో ఓ నిబంధన తీసుకొచ్చిందని చెప్పారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ బాధ్యులకు పదేండ్ల శిక్ష, జరిమానా విధిస్తారని తెలిపారు.
దీనిపై తాము కూడా తదుపరి శాసనసభా సమావేశాల్లో చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు చేపట్టడం, వేగంగా దర్యాప్తు నిర్వహణతో పాటు నిందితులను మూడు నుంచి ఆరు నెలల్లోనే శిక్షించేలా చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు.
ఇక నీట్-యూజీ పేపర్ లీక్ కేసుకు సంబందించి సీబీఐ గురువారం బిహార్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. పట్నా నుంచి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన నిందితులను మనీష్ ప్రకాష్, అశుతోష్గా గుర్తించారు.
Read More :
KCR | సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్.. నెరవేరిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కల