న్యూఢిల్లీ: రికార్డు స్థాయి ఎండలతో అల్లాడుతున్న ఢిల్లీ (Delhi) వాసులకు ఉపశమనం లభించింది. గురువారం ఉదయం నుంచి దేశ రాజధానిలో భారీ వర్షం కురుస్తున్నది. మునిర్కా, సరితా విహార్తోపాటు ఇతర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వాన పడుతున్నది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లడింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఎండ వేడి, ఉష్ణ గాలులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. కాగా, రానున్న రెండు గంటల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఘజియాబాద్, ఇందిరాపురం, నోయిడా, గురుగ్రామ్ సహా రాజధాని నగరంలోని పలు ప్రాంతాల్లో సాధరణం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సీయస్కు చేరుకుంటుందని తెలిపింది.
ఈ వారం చివరినాటికి ఢిల్లీకి పూర్తిస్థాయిలో రుతుపవణాలు వచ్చే అవకాశం ఉందని స్కైమేట్ పేర్కొంది. సాధారణంగా దేశ రాజధాకి జూన్ 27-29 మధ్య రుతుపవనాలు చేరుకుంటాయి. గతేడాది జూన్ 26న ప్రవేశించాయి. ఉత్తరాదిలో ఇప్పటికీ హీట్వేవ్ కొనసాగుతున్నది. జనం ఇండ్లలోనుంచి బయకు రావాలంటే భయపడుతున్నారు. కాగా, రుతుపవనాల రాకకు సంబంధించి వాతావరణ శాఖ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
#WATCH | Heavy downpours in Delhi bring down the temperature, providing relief from the intense heat.
Visuals from Khan Market. pic.twitter.com/nUDZekGF9m
— ANI (@ANI) June 27, 2024
#WATCH | Parts of Delhi receive heavy rainfall, bringing respite from heat.
Visuals from Rao Tularam Marg. pic.twitter.com/uybB5oMhSq
— ANI (@ANI) June 27, 2024
27/06/2024: 07:25 IST; Light to moderate intensity rain and gusty winds with speed of 30-40 Km/h would occur over and adjoining areas of few places of Delhi ( Alipur, Burari, Seelampur, Shahadra, Lodi Road, Lajpat Nagar, Tughlakabad), NCR ( Loni Dehat, Hindon AF Station,
— RWFC New Delhi (@RWFC_ND) June 27, 2024