Bengaluru Firm | టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్లోని బ్రిడ్జ్టౌన్లో శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సమిష్టి ఆటతీరుతో సఫారీలను మట్టికరిపించింది. నరాలుతెగే ఉత్కంఠతో హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొంది 17 ఏండ్ల (2007) తర్వాత టీ20 వరల్డ్ కప్ను ముద్దాడింది. దీంతో యావత్ దేశం సంబరాలు చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకొని బెంగళూరుకు చెందిన ఓ సంస్థ (Bengaluru Firm) తన ఉద్యోగులను ఇవాళ సెలవు (Holiday) ప్రకటించింది. బెంగళూరుకు చెందిన ఎక్స్ఫెనో (Xpheno) అనే స్టాఫింగ్ సంస్థ జులై 1న ఉద్యోగులకు హాలిడే ప్రకటించింది. సంస్థ వర్క్ఫోర్స్ రీసెర్చ్ హెడ్ ప్రసాద్ ఈ మేరకు ప్రకటించారు. టీమ్ ఇండియా గొప్ప విజయాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. అందుకుగానూ ఇవాళ సెలవు ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
17 ఏండ్ల (2007) తర్వాత టీ20 వరల్డ్ కప్ను భారత్ ముద్దాడింది. గత రెండు ప్రపంచకప్లలో తమను దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ను ఇంటికి పంపిన రోహిత్ సేన.. వెస్టిండీస్లోని బ్రిడ్జ్టౌన్లో శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సమిష్టి ఆటతీరుతో సఫారీలను మట్టికరిపించింది. చివరి ఓవర్ వరకూ నరాలుతెగే ఉత్కంఠతో హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో సఫారీలను మట్టికరిపించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. పొట్టి ఫార్మాట్ ఫైనల్ మ్యాచ్లో ఇంతవరకు ఇదే అత్యధిక స్కోరు. ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన సఫారీలు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక పురుషుల క్రికెట్లో భారత్ ఐసీసీ కప్ను అందుకోవడం ఇది నాలుగోసారి. వన్డే క్రికెట్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన భారత్, పొట్టి ఫార్మాట్లో కూడా దానిని సమం చేసింది.
Also Read..
Lok Sabha | పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపిన లోక్సభ
Barbados | హరికేన్ ఎఫెక్ట్.. బార్బడోస్లోనే టీమ్ఇండియా
Jay Shah: ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీలో సీనియర్లు ఆడుతారు : జే షా