Hijab | ముంబై: విద్యార్థినుల బురఖా, హిజాబ్ ధారణపై బాంబే హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. బురఖా, హిజాబ్లపై ఒక విద్యాసంస్థ విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు సమర్థిస్తూ, అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎంతమాత్రం కాదని స్పష్టం చేసింది.
ఒక విద్యా సంస్థను క్రమశిక్షణతో నిర్వహించడంలో భాగంగా విధించిన డ్రెస్ కోడ్ అమలు చేయడం కాలేజీ ప్రాథమిక హక్కు అని డివిజన్ బెంచ్ జస్టిస్లు ఏఎస్ చందూర్కర్, రాజేశ్ పాటిల్ బుధవారం తీర్పు చెప్పారు. కాలేజీ విధించిన డ్రెస్ కోడ్ను కులం, మతంతో సంబంధం లేకుండా అందరి విద్యార్థులకు అమలు చేయాల్సిందేనని పేర్కొంది.
రైళ్లలో పశువుల మాదిరి ప్రయాణం సిగ్గుచేటు
ముంబైలోని లోకల్ రైళ్లలో ప్రయాణికులు జంతువుల మాదిరిగా ప్రయాణిస్తుండటం సిగ్గుచేటు అని ఓ పిల్పై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ చాలా తీవ్రమైన సమస్యను లేవనెత్తారని, దీనిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖను ఆదేశించింది. ప్రయాణికుల సౌకర్యం కోసం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.