న్యూఢిల్లీ: రాముడి జన్మస్థలం బీజేపీకి గుణపాఠం నేర్పిందని రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. లోక్సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఓటమి చెందినట్లు తెలిపారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. అయోధ్య విమానాశ్రయం కోసం భూమి సేకరించారని, కానీ భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. భూమి కోల్పోయిన వారు నిరాశ్రయులు అయినట్లు రాహుల్ ఆరోపించారు. విమానాశ్రయం ఓపెనింగ్ కోసం అదానీని ఆహ్వానించారు కానీ అయోధ్య ప్రజల్ని పిలవలేదని విమర్శించారు. అయోధ్య ప్రజలు మోదీకి భయపడుతున్నారని ఆరోపించారు.
Narendra Modi conducted surveys twice to contest elections from Ayodhya.
The survey results were clear: they advised him not to contest elections from Ayodhya as the people of Ayodhya would defeat him.
Therefore, Narendra Modi went to Varanasi
— Rahul Gandhi pic.twitter.com/uFmORrdZCD
— Satyam Patel | 𝕏… (@SatyamInsights) July 1, 2024
బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు అదానీ, అంబానీ వచ్చారు, కానీ అయోధ్య ప్రజలకు ఆహ్వానం అందలేదన్నారు. ఎయిర్పోర్టు భూమి కోసం చిన్న షాపులను కూడా తీసివేసినట్లు ఆరోపించారు. రామ మందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో ఇండియా కూటమి నేత అవదేశ్ ప్రసాద్ బీజేపీపై విజయం సాధించారు. అయోధ్యలో పోటీ చేసేందుకు మోదీ ప్లాన్ వేశారని, కానీ సర్వేలో ఆయనకు వ్యతిరేకంగా వచ్చిందని, అందువల్లే ఆయన వారణాసి నుంచి పోటీ చేసినట్లు రాహుల్ ఆరోపించారు.