Asaduddin Owaisi : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంలో కొత్తదనం లేదని కొత్త సీసాలో పాత సారాలా ఉందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పెదవివిరిచారు. ఆమె ప్రసంగం మొత్తంలో మైనారిటీల సమస్యలు, నిరుద్యోగం ఊసెత్తలేదని ఆరోపించారు.
దేశంలో ప్రతిచోటా ప్రశ్నాపత్రాల లీకేజ్ జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాషాయ పాలకులు 25 లక్షల యువత జీవితాలతో చెలగాటమాడారని ఆరోపించారు. ఇక అంతకుముందు గురువారం ఉదయం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారని అన్నారు.
ఎమర్జెన్సీ రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయంగా మిగిలిపోయిందని అన్నారు. దేశం అభివృద్ధి పధంలో దూసుకుపోతోందని, దేశ వ్యాప్తంగా బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. రాబోయే బడ్జెట్లో ప్రజలకు మేలు జరిగే పలు నిర్ణయాలు ఉంటాయనే సంకేతాలు పంపారు.
Read More :
KCR | సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్.. నెరవేరిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కల