హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): లోక్సభలో విద్వేషపూరిత ప్రసంగం చేసిన రాహుల్గాంధీ యావత్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. లోక్సభలో విపక్ష నేత హోదా చాలా బాధ్యతాయుతమైనదని, పేదల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. కానీ రాహుల్గాంధీ తన విద్వేషపూరిత ప్రసంగాలకు లోక్సభను వేదికగా వాడుకోవడం దురదృష్టకరమని వెల్లడించారు.
రాహుల్ వ్యాఖ్యలపై బన్సూరీ స్వరాజ్ నోటీసు
తన ప్రసంగంలో రాహుల్ గాంధీ తప్పులు మాట్లాడారని పేర్కొంటూ లోక్సభలో బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ మంగళవారం నోటీసు ఇచ్చారు. తన నోటీసును పరిగణనలోకి తీసుకోవాలని ఆమె స్పీకర్ ఓం బిర్లాను కోరారు. అగ్నిపథ్ పథకం గురించి అయోధ్యలో స్థానికులకు పరిహారం చెల్లింపుపై రాహుల్ గాంధీ అవాస్తవాలు మాట్లాడారని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిరణ్ రిజిజు ఆరోపించారు.