కోటా, జూలై 4: ఉద్యోగ, పోటీ పరీక్షల కేంద్రమైన రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బీహార్కు చెందిన సందీప్ కుమార్ కుర్మి (16) గురువారం తాను ఉంటున్న పీజీ రూములో ఫ్యాన్కు ఉరేసుకుని బలనర్మణానికి పాల్పడ్డాడు. దీంతో కోటాలో జనవరి నుంచి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 13కు చేరింది. కాగా, గత ఏడాది 26 మంది విద్యార్థులు ఉసురు తీసుకున్నారు.
నలంద జిల్లాకు చెందిన సందీప్ గత రెండేళ్లుగా ఇక్కడి మహావీర్నగర్లో ఉంటూ జేఈఈకి శిక్షణ పొందుతున్నాడు. అతని సోదరుడు సంజిత్ కూడా కోటాలోనే వేరే ప్రాంతంలో ఉంటూ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వీరిద్దరి తల్లిదండ్రులు నాలుగేండ్ల క్రితం మరణించగా, వారి అంకుల్ ఇద్దరినీ చదివిస్తున్నాడు. పీజీ రూముల్లో ఆత్మహత్యల నివారణకు తప్పనిసరిగా బిగించాల్సిన యాంటీ సూసైడ్ పరికరం సందీప్ ఆత్మహత్య చేసుకున్న రూమ్ ఫ్యాన్కు బిగించి లేదని పోలీసులు తెలిపారు.