బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మరో భారీ స్కామ్ బయటపడింది. ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ స్వయంగా పర్యవేక్షిస్తున్న మహిళా, శిశుసంక్షేమ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్టు వెల్లడైంది. ప్రభుత్వ పెద్దలు, అధికారులు కలిసి పిల్లల నోటికాడి ముద్దను లాక్కొని, గంపగుత్తగా మేసినట్టు తేలింది. లబ్ధిదారుల సంఖ్యను అమాంతం పెంచడం, రేషన్ సప్లయ్ చేయకపోయినా చేసినట్టు రికార్డుల్లో చూపడం, క్వాలిటీ చెకింగ్స్కు పాతరేయడం ద్వారా భారీ అవినీతికి పాల్పడినట్టు రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ ఇచ్చిన రహస్య నివేదికలో తేలింది. 36 పేజీలున్న ఈ నివేదికను జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ బయటపెట్టింది. శివరాజ్సింగ్ హయాంలో గతంలోనూ వ్యాపం కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కుంభకోణంలో శివరాజ్సింగ్తోపాటు ఆయన భార్య, అప్పటి మధ్యప్రదేశ్ గవర్నర్పై కూడా ఆరోపణలు వచ్చాయి. తాజా కుంభకోణంపై శివరాజ్సింగ్ నోరుమెదుపటంలేదు.
భోపాల్, సెప్టెంబర్ 4: మధ్యప్రదేశ్లో మరో భారీ కుంభకోణం బయటపడిం ది. శివరాజ్సింగ్ నేతృత్వంలోని బీజే పీ ప్రభుత్వంలో నేత లు, అధికారులు కలిసి పసిపిల్లలకు అందాల్సిన తిండిని గంపగుత్తగా మేసేశా రు. లబ్ధిదారుల సంఖ్యను అమాంతం పెంచి ఒకచోట, అసలు లబ్ధిదారులే లేనిచోట్ల వేలమంది ఉన్నారని చూపి మరోచోట వందలకోట్ల విలువైన ఆహార పదార్థాలను మింగేశారు. ఇదంతా జరిగింది సాక్షాత్తూ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ చేతిలో ఉన్న మహిళా శిశు సంక్షేమశాఖలోనే కావటం గమనార్హం. ఈ కుంభకోణాన్ని బయటపెట్టింది కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆడిటరే. కుంభకోణంపై ప్రభుత్వ ఆడిటర్ రూపొందించిన 36 పేజీల నివేదికను ప్రముఖ ఇంగ్లిష్ టీవీ చానల్ ఎన్డీటీవీ బయటపెట్టింది. శివరాజ్సింగ్ హయాంలో గతంలోనూ వ్యాపం కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కుంభకోణంలో శివరాజ్సింగ్తోపాటు ఆయన భార్య, అప్పటి మధ్యప్రదేశ్ గవర్నర్పై కూడా ఆరోపణలు వచ్చాయి. తాజా కుంభకోణంపై శివరాజ్సింగ్ నోరుమెదుపటంలేదు.
కుంభకోణం జరిగింది ఇలా..