Bridge Collapses | బీజేపీ, జేడీయూ పాలిత బీహార్ (Bihar) రాష్ట్రంలో వరుసగా వంతెనలు కూలిపోతుండటం (Bridge Collapses) ఆందోళన కలిగిస్తున్నది. గత రెండు వారాల నుంచి వరుసగా బ్రిడ్జ్లు, కాజ్వేలు కూలిపోతున్నాయి. ఇక బుధవారం ఒక్కరోజే మూడు వంతెనలు/కాజ్వేలు కూలిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ కూడా మరో బ్రిడ్జ్ కూలిపోయింది.
సరన్ (Saran) జిల్లాలో గండకి నదిపై (Gandaki River) ఉన్న వంతెన గురువారం ఉదయం కూలిపోయినట్లు జిల్లా మెజిస్ట్రేట్ అమన్ సమీర్ తెలిపారు. ఇది 15 ఏళ్ల నాటి వంతెన అని చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. బ్రిడ్జి కూలడానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. సరన్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో వంతెనలు కూలడం ఇది మూడోదిగా పేర్కొన్నారు. ఈ ఘటనతో సరన్లోని గ్రామాలను పొరుగున ఉన్న సివాన్ జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, 15 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో వంతెనలు కూలడం ఇది పదో ఘటన (10th incident in 15 days) కావడం గమనార్హం.
STORY | Another bridge collapses in #Bihar, 10th such incident in over 15 days
READ: https://t.co/aZ48PfYwcu pic.twitter.com/CeuhS6LyFy
— Press Trust of India (@PTI_News) July 4, 2024
వరుసగా వంతెనలు కూలిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదులు, కాలువలపై నిర్మించిన వంతెనల పటిష్టతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పబ్లిక్ వర్క్స్లో నాణ్యతా లోపాలు, అక్రమాల వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో నితీశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని పాత వంతెనలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే మరమ్మతులు జరపవలసిన వంతెనలను గుర్తించాలని చెప్పారు.
Also Read..
Team India | ప్రధాని మోదీతో ముగిసిన టీమ్ ఇండియా క్రికెటర్ల భేటీ.. ముంబైకి పయనం
Thief | ఇంటిని దోచుకుని.. నెలలో తిరిగిచ్చేస్తానంటూ లేఖ రాసిన దొంగ
Anant Weds Radhika | అంబానీ ఇంట సంప్రదాయ మామేరు వేడుక.. మెరిసిపోయిన పెళ్లికూతురు.. వీడియోలు