కిషన్గంజ్: ఎన్డీయే పాలిత బీహార్లో మరో బ్రిడ్జి కూలింది. 10 రోజుల వ్యవధిలో ఇది నాలుగోది కావడంతో నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కిషన్గంజ్ జిల్లా బహదూర్ గంజ్ బ్లాక్లో 70 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పున ఉన్న బ్రిడ్జికి ఇటీవల మరమ్మతులు ప్రారంభించారు. 2011లో నిర్మించిన ఈ బ్రిడ్జి కంకాయ్ నదిని, మహానందతో కలుపుతుంది. మడియాలోని ఈ బ్రిడ్జి పలువురు గిరిజనులకు ఉపయోగపడేది.
కాగా, ఇటీవల నేపాల్ పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు హఠాత్తుగా నదిలో నీటిమట్టం పెరిగింది. అందులో ఒక పిల్లర్ ప్రవాహ ఉద్ధృతికి పడిపోవడంతో బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. గత పది రోజుల్లో బీహార్లోని అరారియాలో రెండు చోట్ల, శివాన్లో ఒక చోట బ్రిడ్జి కూలిన ఘటనలు చోటుచేసుకున్నాయి.