Annamalai : తమిళనాడులో బీజేపీ విజయం కోసం తీవ్రంగా శ్రమించిన ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై (Annamalai) ఓటమి దిశగా సాగుతున్నారు. కోయింబత్తూరు (Coinbatore) నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన అన్నామలైపై డీఎంకే (DMK) అభ్యర్థి గణపతి రాజ్కుమార్ (Ganapati Rajkumar) ఆధిక్యంలో ఉన్నారు.
ప్రస్తుతం అన్నామలైపై గణపతి రాజ్కుమార్ 17,486 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గణపతి రాజ్కుమార్కు మొత్తం 76,291 ఓట్లు పోలవగా, అన్నామలైకి 58,805 ఓట్లు వచ్చాయి. అయితే నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో అన్నామలైకి కేవలం ఒకే ఒక్క ఓటు పోలైంది. పోటీలో రెండో స్థానంలో కొనసాగుతున్న అన్నామలైకి ఓ పోలింగ్ బూత్లో ఒక్కటే ఓటు పడటం గమనార్హం.