Amarnath Yatra | జమ్ముకశ్మీర్ లో అమర్ నాథ్ యాత్రికులకు పెను ప్రమాదం తప్పింది. అమర్ నాథ్ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో యాత్రికులతో బయలుదేరిన బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న భక్తులు ఆందోళనకు గురయ్యారు. బస్సు కదులుతుండగానే కిందకు దూకడంతో పది మందికి గాయాలయ్యాయి. అయితే, అక్కడ భద్రతా విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ బలగాలు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్ రాష్ట్రం హోషియార్ పూర్ ప్రాంతానికి చెందిన సుమారు 40 మంది యాత్రికులు అమర్ నాథ్ దర్శనం చేసుకుని బస్సులో తిరుగు ప్రయాణం అయ్యారు.
జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై రామ్ బన్ జిల్లాలోని బనిహాల్ సమీపంలోకి రాగానే బ్రేక్స్ ఫెయిలయ్యాయని బస్సు డ్రైవర్ చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన కొందరు భక్తులు ప్రాణభయంతో బస్సు వెళుతుండగానే కిందకు దూకేయడంతో ఒక చిన్నారి, ముగ్గురు మహిళలతోపాటు పది మందికి గాయాలయ్యాయి.భక్తులు నడుస్తున్న బస్సు నుంచి కిందకు దూకడం గమనించిన భద్రతా బలగాలు సమయస్ఫూర్తితో వ్యవహరించాయి. బస్సు టైర్ల కింద రాళ్లు పెట్టి చివరకు దాన్ని నిలువరించారు. ఘటనా స్థలానికి అంబులెన్స్ రప్పించి, గాయ పడిన వారికి వైద్య సాయం అందించామని పోలీసు, భద్రతా బలగాల అధికారులు చెప్పారు.
Electricity Bills | ఇక ఆ సిస్టమ్తోనే ఎలక్ట్రిసిటీ బిల్లులు పేమెంట్స్.. ఎందుకంటే..?
Most Affordable Cars | రూ.5 లక్షల్లోపు ధర గల కార్లు కావాలా.. మూడే ఆప్షన్లు.. అవేంటంటే..?!
Coca-Cola | భారత్ మార్కెట్కు కోకా కోలా గుడ్బై.. ఈ నిర్ణయం వెనుక కారణాలేంటి..?!