Bengal Violence : పశ్చిమ బెంగాల్లోని కూచ్బెహర్లో ఓ మైనారిటీ మహిళపై దాడి ఘటనను కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి ఖండించారు. ఏ వర్గానికి, కులానికి చెందిన మహిళలపైనా దాడులు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడ్డాయని, రాష్ట్రంలో పాలక పార్టీ అధిక సీట్లు గెలుపొందింది..అయినా ప్రభుత్వం ఎందుకు రాష్ట్రంలో హింసకు తావిస్తోందని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల అనంతరం ఏ రాష్ట్రంలోనూ చూడనన్ని ఇలాంటి అరాచక ఘటనలు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు. మహిళలపై దాష్టీకం ప్రదర్శించే హక్కు ఏ ఒక్కరికీ లేదని ఆయన పేర్కొన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని చోప్రాలో జనం చుట్టూ గుమిగూడి చూస్తుండగా మహిళను ఒక వ్యక్తి దారుణంగా కొట్టాడు. (Woman Beaten Up) మరో వ్యక్తిపై కూడా అక్కడున్న వారు దాడి చేశారు.
ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘వీధి తీర్పు’పై విమర్శలు వెల్లువెత్తాయి. దెబ్బలు తాళలేక మహిళ బాధతో అరుస్తున్నా ఆ వ్యక్తి కొట్టడం ఆపలేదు. కింద కూర్చొన్న వ్యక్తిని కూడా అతడు కొట్టాడు. గుంపులోని వారంతా కళ్లప్పగించి దాడిని చూశారు. జనం దాడిని ఆపడానికి ప్రయత్నించకపోగా కొట్టిన వ్యక్తికి అండగా నిలిచారు. మరో వ్యక్తి కూడా ఆ మహిళ జట్టుపట్టుకుని కాళ్లతో తన్నాడు. అయితే ఆ మహిళతో పాటు వ్యక్తిని బహిరంగంగా ఎందుకు కొట్టారో అన్నది తెలియరాలేదు.
Read More :