Jarkhand : జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ మరోసారి పగ్గాలు చేపడుతున్న క్రమంలో బీజేపీపై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ విమర్శలు గుప్పించారు. జార్ఖండ్లో బీజేపీ ఆపరేషన్ ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు. జార్ఖండ్లో బీజేపీ వ్యూహం పూర్తిగా పెయిలైందని, హేమంత్ సోరెన్ను జైలుకు పంపి ఆయన వదిన సాయంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చవచ్చని, బీజేపీ అక్కడ పాగా వేయవచ్చని కాషాయ పార్టీ ఆలోచించిందని అన్నారు.
అయితే హేమంత్ సోరెన్ తన పార్టీతో పాటు ప్రభుత్వాన్ని కాపాడుకుని బీజేపీకి షాక్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. జార్ఖండ్ ప్రజలు హేమంత్ సోరెన్ను అనుకూలంగా తీర్పు ఇచ్చారని, ప్రజా తీర్పును పొందిన హేమంత్ సోరెన్ తిరిగి జార్ఖండ్ సీఎం అవుతుంటే బీజేపీ ఎందుకు నిస్తేజానికి గురువుతున్నదని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈరోజే బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా, మనీలాండరింగ్ కేసులో అరెస్టైన హేమంత్ సోరెన్.. ఐదు నెలల తర్వాత జూన్ 28న బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై హేమంత్ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
దీంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావడం లాంఛనం అయ్యింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా హేమంత్ సొరేన్ ఇవాళ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కోరారు. గవర్నర్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీంతో జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా హేమంత్ సొరేన్ ఇవాళ సాయంత్రం బాధ్యతలు చేపట్టనున్నారు.
Read More :