Hathras Stampede : యూపీలోని హాథ్రాస్లో జరిగిన భోలే బాబా(Bhole Baba) సత్సంగ్లో విషాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇంత పెద్దసంఖ్యలో ఓ ఆథ్యాత్మిక కార్యక్రమం జరుగుతున్నా ఆస్ధాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. తొక్కిసలాటలో దాదాపు 121 మంది మరణించారు. ఈ ఘటనకు బాధ్యులైన బాబా ఆచూకీ అంతుబట్టడం లేదు. ఇక మంగళవారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు .. సత్సంగ్ ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది.
కానీ ఆ ఘటన తర్వాత భోలే బాబా ఆనవాళ్లు దొరకడం లేదు. ఆయన పరారీలో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆ బాబా కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా ఈ ఘటనపై దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఇక హథ్రాస్ తొక్కిసలాట ఘటనపై ఆప్ నేత సంజయ్ సింగ్ స్పందిస్తూ దేశంలో ప్రజల ప్రాణాలకు విలువలేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఓ వ్యక్తి ఏకంగా తన పేరిట బాబా బజార్ను నిర్మిస్తున్నా ఆయనపై ఎలాంటి నియంత్రణ లేదని అన్నారు. ఇది కేవలం హథ్రాస్లోనే కాదని, దేశవ్యాప్తంగా ఇదే పరిస్ధితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. హరియాణలో ఏం జరిగిందో మనమంతా చూశామని, హత్యాచార ఘటనలో దోషిగా తేలిన ఓ బాబా తాను కోరుకున్నప్పుడు బయటకు వస్తారని, ప్రభుత్వ యంత్రాంగం ఆయనకు సాగిలపడుతుందని అన్నారు. ఇలాంటి బాబాల మార్కెట్ దేశంలో ఓ వెలుగు వెలుగుతుంటే ఇలాంటి ఘటనలను ఎలా నియంత్రిస్తారని ప్రశ్నించారు.
Read More :
Assembly speaker | ఫిరాయింపులకు నేను వ్యతిరేకం.. అసెంబ్లీ స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా