పుదుచ్చేరి, జూలై 4: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అధికార ఏఐఎన్ఆర్సీ-బీజేపీ సంకీర్ణంలో విభేదాలు వీధికెక్కాయి. ముఖ్యమంత్రి రంగస్వామి పాలనలో అవినీతి పేరుకుపోయిందని, ప్రజావ్యతిరేక విధానాలు అధికమయ్యాయని ఆరోపిస్తూ బీజేపీ, కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మొత్తం ఏడుగురు బుధవారం ఢిల్లీలో పార్టీ చీఫ్ నడ్డాను కలిశారు.
ఏకైక స్థానానికి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓటమికి రంగస్వామి అసమర్థ పాలనే కారణమని వారు ఆరోపించారు. ఈ బృందం సభ్యులు కేంద్ర మంత్రి, పుదుచ్చేరి పరిశీలకుడు అర్జున్ రామ్ మేఘ్వాల్, లెఫ్ట్నెంట్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను సైతం కలిశారు. 30 మంది సభ్యులున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ఏఐఎన్ఆర్సీకి 10 మంది, బీజేపీకి ఆరుగురు, ఇండిపెండెంట్లు ఆరుగురు, డీఎంకే, కాంగ్రెస్కు 8,ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉన్నారు.