Maths Teachers | న్యూఢిల్లీ: ఇండియా, పశ్చిమాసియాలోని దాదాపు 80 శాతం మంది మ్యాథ్స్ టీచర్లకు బేసిక్స్ కూడా తెలియవని ఓ ఎడ్టెక్ కంపెనీ ఈఐ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. రేషియో, ప్రపోర్షనల్ రీజనింగ్, ఆల్జీబ్రా రీజనింగ్, లాజికల్ రీజనింగ్ వంటి వాటి గురించి కూడా తెలియవని అధ్యయనం తేల్చేసింది.
ఇండియా, యూఏఈ, ఒమన్, సౌదీ అరేబియాలో 152 స్కూళ్లకు చెందిన 3, 4, 5, 6 తరగతులకు చెందిన 1,300 మందికిపైగా టీచర్లను రెండేండ్లపాటు అధ్యయనం చేసిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. అసెస్మెంట్ తీసుకున్న టీచర్లలో 80 శాతం భారతీయులు కాగా, 18 శాతం మంది యూఏఈ, ఒక శాతం ఒమన్, సౌదీ అరేబియాకు చెందినవారు.
75 శాతం మంది ఉపాధ్యాయులు 50 శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడంలో ఇబ్బంది పడ్డారు. బట్టీ చదువులకు ప్రాధాన్యమిస్తున్న మన విద్యా వ్యవస్థకు ఇది ఒక కనువిప్పులాంటిదని ఈఐ సహవ్యవస్థాపకులు శ్రీధర్ రాజగోపాలన్ అన్నారు. అసెస్మెంట్ ర్యాంకింగ్స్లో భారత్ 73 దేశాలకుగానూ 72వ ర్యాంకులో నిలవడం పరిస్థితికి అద్దంపడుతున్నదన్నారు. టీచర్లు నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని అన్నారు.
న్యూఢిల్లీ, జూన్ 28: కేంద్ర ప్రభుత్వ అప్పులు ఏటికేటికి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి ప్రభుత్వ స్థూల అప్పులు రూ.171.78 లక్షల కోట్లకు చేరాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్తో ముగిసిన త్రైమాసికం నాటికి రూ.166.14 లక్షల కోట్ల అప్పులు ఉండగా.. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో(జనవరి-మార్చి) 3.4 శాతం పెరిగాయని పబ్లిక్ డెబిట్ మేనేజ్మెంట్ నివేదిక పేర్కొన్నది.
న్యూఢిల్లీ, జూన్ 28: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు మరో వ్యోమగామి విల్మోర్తో చేరుకున్న భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్తో పాటు బల్ విల్మోర్ గంట పాటు స్పేస్ క్రాఫ్ట్లోని క్యాప్సుల్స్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రష్యాకు చెందిన కాలం చెల్లిన ఉపగ్రహం అంతరిక్షంలో విచ్ఛిన్నమై 100కు పైగా ముక్కలు కావడంతో దాని శకలాలు అంతరిక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో సంచరించే అవకాశాలు ఉండటంతో నాసా వారిని హెచ్చరించింది. దీంతో ముందు జాగ్రత్తగా సునీతా విలియమ్స్ సహా మిగతా వ్యోమగాములు సురక్షిత ప్రాంతంలో దాక్కోవాల్సి వచ్చింది.