Apps | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): వినియోగదారులను మోసపుచ్చి ఆర్థిక ప్రయోజనం పొందుతున్న యాప్స్ దేశంలో పెరిగిపోతున్నట్టు అడ్వైర్టెజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) తాజా నివేదికలో వెల్లడించింది. తాము విశ్లేషించిన 53 యాప్స్లో 52 యాప్స్ ఇలాంటి ‘డార్క్ ప్యాటర్న్స్’ను అనుసరిస్తున్నట్టు తెలిపింది. ఈ జాబితాలో నెట్ఫ్లిక్స్, ఓలా, స్విగ్గీ వంటి యాప్స్ ఉన్నట్టు పేర్కొంది.
1. గోప్యతకు భంగం: 79 శాతం యాప్స్లో యూజర్ల ప్రైవసీకి సంబంధించిన భద్రతలో లోపాలు ఉన్నట్టు గుర్తించామని నివేదిక వెల్లడించింది.
2. ఇంటర్ఫేస్లో జోక్యం: ఏదైనా ఐటెమ్ ఆర్డర్ ఇవ్వాలనుకొంటున్నప్పుడు మనం సెలక్ట్ చేయకపోయినా.. కొన్ని ఐటెమ్స్ను లేదా సేవలను డీఫాల్ట్గా యాడ్ చేస్తూ అంతిమ ధరను పెంచడం. ఇలాంటి మోసాలు 45% యాప్స్లో గుర్తించినట్టు నివేదిక తెలిపింది.
3. డ్రిప్ ప్రైసింగ్: ప్రారంభంలో ధర తక్కువగా చూయిస్తూ, పేమెంట్ ఆప్షన్కు వచ్చే సరికి హిడెన్ ఛార్జీలు, అదనపు రుసుములను కలిపేయడం. ఇలాంటి మోసాలు 43 శాతం యాప్స్లో ఉన్నట్టు నివేదిక వివరించింది.
4. ఫాల్స్ అర్జెన్సీ: యూజర్లకు నిర్ణయం తీసుకొనే సమయం ఇవ్వకుండా ఆఫర్ అయిపోతుందని డెడ్లైన్ టైమ్ పెడుతూ మోసపుచ్చడం. ఇలాంటి మోసాలు 32 శాతం యాప్స్లో జరుగుతున్నట్టు గుర్తించారు.