Road Accident | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం అర్ధరాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి (Two Cars Collision). ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మహారాష్ట్రలోని జల్నా సమీపంలో ముంబై – నాగ్పూర్ ఎక్స్ప్రెస్ వేపై (Mumbai – Nagpur Expressway) ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్యూయల్ రీఫిల్లింగ్ కోసం పెట్రోల్ పంప్ వద్దకు వెళ్లేందుకు ఓ కారు రాంగ్ డైరెక్షన్లో వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. రెండు కార్లు ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ఏర్పడిన ట్రాఫిక్ను పోలీసులు క్లియర్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Amarnath Yatra: బల్తాల్ రూట్లో వెళ్తున్న అమర్నాథ్ యాత్రికులు.. వీడియో
CV Ananda Bose: మమతా బెనర్జీపై పరువునష్టం కేసు వేసిన గవర్నర్ ఆనంద్ బోస్
BJP | ప్రచారం ఘనం నిర్మాణాల్లో లోపం.. బీజేపీ సర్కారు పనుల్లో నాణ్యత డొల్ల