Shooting | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి (Varanasi)లో కాల్పుల (Shooting) ఘటన కలకలం రేపింది. సమాజ్వాదీ పార్టీ నాయకుడు (Samajwadi Party Leader), మాజీ కార్పొరేటర్ విజయ్ యాదవ్ (Vijay Yadav) నివాసం వద్ద కొందరు వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి సహా మొత్తం ఆరుగురు గాయపడ్డారు.
దశాశవమేధ్ ప్రాంతంలో ఆదివారం ఈ కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తన కుటుంబాన్ని మొత్తం హత్య చేయడమే లక్ష్యంగా దాడి చేసినట్లు విజయ్ యాదవ్ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా అంకిత్ యాదవ్, శోభిత వర్మ, గోవింద్ యాదవ్, సాహిల్ యాదవ్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఈ కాల్పుల ఘటనలో గాయపడిన వారిని నిర్భయ్ యాదవ్ (6), కిరణ్ యాదవ్, ఉమేష్ యాదవ్, దినేష్ యాదవ్, శుభమ్ అలియాస్ గోలుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. మరోవైపు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని , వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ కుమార్ తెలిపారు.
Also Read..
Rs 2,000 Notes | ఇంకా ప్రజల వద్దే రూ.7,755 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు : ఆర్బీఐ
Lok Sabha | నీట్ అంశంపై చర్చకు స్పీకర్ నిరాకరణ.. లోక్సభ నుంచి విపక్షాలు వాకౌట్