Bus Accident | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) చోటు చేసుకుంది. హిమాచల్ప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన బస్సు సిమ్లా (Shimla)లోని రోహ్రు ప్రాంతంలో గల కుద్దు నుంచి దిల్తారీకి వెళ్తోంది. ఈ క్రమంలో జుబ్బల్లోని కెంచి ప్రాంతంలోకి రాగానే బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్, ఓ మహిళ, నేపాలీ జాతీయుడు మృతి చెందినట్లు గుర్తించారు. వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు.
Also Read..
International Yoga Day | అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు, ప్రముఖులు
PM Modi | యోగా సాధనతో సకారాత్మక ఆలోచనలు: ప్రధాని మోదీ
Unwanted Calls | అన్వాంటెడ్ బిజినెస్ కాల్స్కు త్వరలో చెక్!