జమ్ము: జమ్ముకశ్మీరులోని దోడా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య గండోహ్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
ఇటీవల లోయలో సైన్యం, పోలీసులపై జరిగిన దాడుల్లో ఈ ఉగ్రవాదులకు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఎం4 కార్బైన్ సహా పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వరుస ఉగ్రవాద దాడుల నేపథ్యంలో దోడా, రాజౌరీ, పూంఛ్ ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాలను పెంచారు.