Password | ముంబై, జూలై 3: ఆర్థిక లావాదేవీలకైనా.. వ్యక్తిగత సమాచారం గోప్యతకైనా.. పాస్వర్డ్లే చాలా కీలకం. అయినప్పటికీ ఈ పాస్వర్డ్ల విషయంలో దేశంలోని సగం మంది వైఖరి నిర్లక్ష్యంగానే ఉంటుండటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.
తాజాగా వచ్చిన ఓ సర్వేలో మెజారిటీ భారతీయులు తమ పాస్వర్డ్లను అజాగ్రత్తగా ఉంచుకుంటున్నారని, ఇతరులతో పంచుకుంటున్నారని తేలింది. ఏటీఎంలు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపాస్వర్డ్ల విషయంలో దాదాపు 17 శాతం మంది అశ్రద్ధ వహిస్తున్నారని లోకల్సర్కిల్స్ అధ్యయనంలో స్పష్టమైంది. మొబైల్ ఫోన్ డాటా, కాంటాక్ట్ లిస్ట్ అంశాల్లోనూ నిర్లక్ష్యంగా ఉంటున్నారు. 34 శాతం తమ పాస్వర్డ్లు ఇతరులతో పంచుకుంటున్నారు.