యాదాద్రి, భువనగిరి : భక్తుల ఇలవేల్పు యాదాద్రి (Yadadri) లక్ష్మీనరసింహ స్వామి హుండీ ఆదాయం (Income) భారీగా తగ్గింది. గత మూప్పై రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలు, వివిధ చెల్లింపుల వల్ల హుండీకి రూ. 3.49 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి(EO) తెలిపారు.
ఒక వంద అరవై ఆరు గ్రాముల మిశ్రమ బంగారం, నాలుగు కిలోలు ఏడు వందల యాభై గ్రాముల మిశ్రమవెండిని భక్తులు హుండీలో వేశారని తెలిపారు. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ (Currency) కూడా హుండీలో వచ్చిందన్నారు.
అమెరికాకు చెందిన 1,163 డాలర్లు, ఆస్ట్రేలియాకు చెందిన 5 డాలర్లు, యూఏఈకి చెందిన 210 దిరమ్స్ , నేపాల్కు చెందిన 400 రుపిస్, సౌదీ అరేబియన్కు చెందిన 37 రియల్స్ వచ్చినట్లు వెల్లడించారు. సింగపూర్కు చెందిన 40 డాలర్స్ , కువైట్కు చెందిన రెండు దినర్స్, ఖతర్ చెందిన 60 రియల్స్, ఒమన్కు చెందిన 200 బైస , పోలాండ్, మారిషస్, శ్రీలంక తదితర దేశాలకు కరెన్సీ హుండీలో వచ్చిందని పేర్కొన్నారు.