కొండమల్లేపల్లి, జూన్ 29 : రాష్ట్రంలో అంతరించిపోతున్న అడవుల విస్తీర్ణం పెంచడంతోపాటు గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచేందుకు, వాతావరణ కాలుష్యం నివారణే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. తొమ్మిదేండ్లపాటు యేటా అడవులు, ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఎక్కడ అవసరమున్నా పెద్ద ఎత్తున మొక్కలు నాటించింది. దాంతో మొక్కలు పెరిగి వృక్షాలుగా మారాయి. దాంతో పచ్చదనం పెరిగి వాతావరణంలో అనుకూల మార్పులు వచ్చాయనడంలో సందేహం లేదు.
కానీ కాంగ్రెస్ సర్కారు హరితహారం కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదు. వర్షాలు పడుతున్నా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. పైగా గతంలో నాటిన మొక్కలను సంరక్షించడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. పలుచోట్ల ఎండుతున్న మొక్కలే ఇందుకు నిదర్శనం. ప్రతిరోజూ నీటిని పెట్టాల్సిన పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండడంతో మొక్కలు బతికే పరిస్థితి లేకుండా పోయింది. రోడ్ల వెంట మొక్కలే కాకుండా పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు ఎండి పచ్చదనం లేకుండా పోతున్నది.
హరితహారంలో భాగంగా గత ప్రభుత్వం కొండమల్లేపల్లి మండల వ్యాప్తంగా 26 నర్సరీలను ఏర్పాటు చేసింది. గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లు ఏర్పాటు చేసి వాటికి ఇరువైపులా మొక్కలు నాటించింది. ఇండ్లలో పెంచేందుకు పూలు, పండ్లు, షో మొక్కలను ఉచితంగా అందజేసింది. 2015 నుంచి 2023 వరకు మండల వ్యాప్తంగా 3.24 లక్షల మొక్కలను నాటించింది. దాంతో పచ్చదనం పెరిగి ప్రజలకు ఆహ్లాద వాతావరణాన్ని అందించింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు మొక్కల సంరక్షణను గాలికి వదిలేసింది. కొత్తగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదు.
కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో నూతనంగా నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డు డివైడర్ల మధ్యన దాదాపు కిలోమీటర్ వరకు కేసీఆర్ ప్రభుత్వం 450 మొక్కలు నాటించి ట్రీ గార్డులు ఏర్పాటు చేసింది. ఒక్కో మొక్కకు రూ.400 ఖర్చయ్యింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవ డం, సిబ్బంది నిర్లక్ష్యంతో మొక్కలు ఎం డుతున్నాయి. సర్పంచులు పదవిలో ఉన్నప్పు డు భయానికో భక్తికో వాటిని సంరక్షించే వి ధంగా పారిశుధ్య కార్మికులను పురమాయించేవారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారులు ఉం డడంతో పర్యవేక్షించే వారే కరువయ్యారు. నర్సరీల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. కమూ ్యనిటీ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్, మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్, బ యోఫెన్సింగ్ ప్లాంటేషన్, రోడ్డుసైడ్ ప్లాంటేషన్ పేరుతో నాటిన వేలాది మొక్కలు నిర్వహణ లేక ఎండిపోతున్నా యి. ఇప్పటికైనా ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టి మొక్కలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.