నీలగిరి, జూన్ 19 : ప్రజా సమస్యల పరిషారానికి నిరంతరం కృషి చేస్తానని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. పోలీస్ గ్రీవెన్స్లో భాగంగా బుధవారం ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్స్టేషన్ల సిబ్బందితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఫిర్యాదుదారుడి వినతి పరిశీలించి సమస్యలపై చట్ట పరిధిలో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలపై నిర్భయంగా తన కార్యాలయానికి రావాలని, తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు.