మిర్యాలగూడ, జూన్ 30 : పట్టణంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఆదివారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన బ్యాడ్మింటన్ అండర్ -15, 17 విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో పలువురు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు జిల్లా సెక్రటరీ టి.రంగారావు, జిల్లా కోచ్ ఎం.రామకృష్ణ తెలిపారు.
నల్లగొండ అండర్ -15 విభాగంలో టి.అక్షిత్రెడ్డి, వి.మణిశంకర్, చందన, వెంకటసాయివైష్ణవి, అలీ, కార్తీకేయ, మనోజ్ఞ, రిధాహస్మి.. అండర్ -17లో ఎస్.అఖిలేశ్గౌడ్, అన్విత్నిహాల్రెడ్డి, చందన, లిల్లిగ్రేస్, హారిక, చైత్ర.. సూర్యాపేట జిల్లా అండర్-15లో యశస్విని, శ్రీలాస్య, అనసూజ, అక్షర, అభినవ్, సంతోష్, గౌతమ్, సంతోష్.. అండర్-17లో ఎం.అభిరామ్వర్మ, ఎన్.అభిరామ్, శ్రీలాస్య, యశస్విని, కీర్తన, అభినవ్, తేజస్విని, హారిక ఎంపికైనట్లు చెప్పారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్, జిల్లా ఉపాధ్యక్షుడు టి.ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ పట్టణంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 30న నల్లగొండ, సూర్యాపేట జిల్లాల జూనియర్ బ్యాడ్మింటన్ అండర్ -15, 17 (బాల, బాలికల) క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు మిర్యాలగూడ డీఎస్ఏ బ్యాడ్మింటన్ కోచ్ ఎం.రామకృష్ణ గురువారం తెలిపారు.
ఎంపికైన అండర్ 15 క్రీడాకారులను జూలై 14 నుంచి 17వరకు మెదక్ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో, అండర్ 17లో ఎంపికైన క్రీడాకారులు జూలై 23 నుంచి 26వరకు వరంగల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 30న జరిగే ఎంపిక పోటీలకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు.