నీలగిరి, జూన్ 29 : నేర నియంత్రణలో భాగంగా నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చాలా నేరాల్లో నంబర్ లేని వాహనాలను వాడుతూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నారని అన్నారు.
వీటికోసం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్లు చేపట్టాలని సూచించారు. వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే 1,769 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
అనంతరం జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందుతున్న ఎస్ఐలు బి.యాదగిరి, ఎస్.నందులాల్, ఏఎస్ఐలు ఎంఏ.ఖదీర్, ఎన్.వెంకటేశ్వర్లు, ఏఆర్ఎస్ఐ ఎన్.నరసింహారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ రావు, ఎల్జీఎస్ పుల్లమ్మను ఘనంగా ఎస్పీ సన్మానించారు. పోలీసు శాఖకు వారు అందించిన సేవలను కొనియాడారు. అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఎస్బీ డీఎస్పీ రమేశ్, ఏఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ షబ్బీర్, ఆర్ఐలు సూరప్ప నాయుడు, సంతోష్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, సోమయ్య పాల్గొన్నారు.