యాదగిరిగుట్ట, జూన్30 : యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వినాయక నాట్య మండలి సురభి వారి నాటక ప్రదర్శన ఆదివారంతో ముగిసింది. చివరిరోజు మాయాబజార్ నాటకం అత్యంత భక్తి పూరితంగా సాగింది.
పలు కళాకారులు శ్రీకృష్ణుడు, బలరాముడు, అభిమన్యుడు, నారదుడు, ఘటోత్కచుడు, హిడింబి, శశిరేఖ, రేవతి, రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్ర వింద వంటి వివిధ వేషాలతో భక్తులను అలరించారు. ముగింపు సందర్భంగా వినాయక నాట్య మండలి నిర్వాహకులను ఆలయ డీఈఓ భాస్కర్శర్మ, ఏఈఓ శ్రవణ్కుమార్ సన్మానించి, స్వామివారి ప్రసాదం, ధ్రువపత్రాలను అందజేశారు.