నీలగిరి, జూన్ 26 : జీవితాలను నాశనం చేసే డ్రగ్స్ను తరిమేద్దామని, నల్లగొండను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండలో చేపట్టిన అవగాహన ర్యాలీని ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవితంలో 15 నుంచి 35 సంవత్సరాల్లోపు వయసు చాలా ముఖ్యమైనదని, జీవితాన్ని మలుచుకునే ఈ వయస్సులో మాదక ద్రవ్యాలకు బానిస కావడం వల్ల జీవితం నాశనం అవుతుందని అన్నారు. డ్రగ్స్ ఆలోచన మందగించే విషంతో సమానమని, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటికి బానిసైతే జీవితానికి అర్థమే ఉండదని సూచించారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నల్లగొండను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నదన్నారు. మాదక ద్రవ్యాల అమ్మకం, రవాణా, వాటి మూలాలు ఎకడున్నాయనే వాటిపై ఉకుపాదం మోపుతామని తెలిపారు.
మాదక ద్రవ్యాలు అనేవి పెద్ద ట్రాప్ అని, వాటి కోసం యువత ప్రయత్నించకూడదని సూచించారు. మాదక ద్రవ్యాలు అమ్మినా, సరఫరా చేసినా వెంటనే పోలీస్ శాఖకు తెలియజేయాలన్నారు. నిందితులకు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల నుంచి క్లాక్టవర్ వరకు నిర్వహించిన ర్యాలీలో ప్రముఖులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ను నిర్మూలిద్దాం.. యువతను కాపాడుదాం. డ్రగ్స్ను పకన పెట్టు.. జీవితాన్ని గాడిలో పెట్టు అని నినదించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ దీప్తి, విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, గిరిజన అభివృద్ధి శాఖ అధికారి రాజ్కుమార్, ఐసీడీఎస్ పీడీ సకుబాయి, నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, ఇండియన్ రెడ్క్రా స్ చైర్మన్ గోలి అమరేందర్రెడ్డి, లయన్స్ క్లబ్ చైర్మన్ కేవీ ప్రసాద్, విద్యార్థులు, 12వ బెటాలియ న్ పోలీసులు, లైన్స్ క్లబ్, వాకర్స్ అసోసియేష న్, డాక్టర్స్ అసోసియేషన్, ఇండియన్ రెడ్క్రాస్ సొ సైటీ, పీఈటీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.