భువనగిరి అర్బన్, జూన్ 26 : యువత చెడు అలవాట్లకు లోనుకావద్దని, తమ జీవితాన్ని ఆగం చేసుకోవద్దని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం – అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురసరించుకొని భువనగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ, ఎక్సైజ్, మెడికల్, పోలీసు శాఖల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకర ఆలోచనలతో ముందుకు సాగాలని, మంచి దారిలో నడిచి జీవితంలో విజయం సాధించాలని అన్నారు. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన డ్రగ్స్ గ్రామాల్లోకి పాకడం బాధాకరమని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడకంతో కుటుంబాలకే కాకుండా సమాజానికి తీవ్ర నష్టమని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారిని గమనిస్తుండాలని సూచించారు. అందరం కలిసి డ్రగ్స్కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు.
కలెక్టర్ హనుమంతు కే. జెండగే మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వ్యవస్థను నాశనం చేస్తాయని, డ్రగ్స్ వాడకంతో ఆరోగ్యపరంగా, ఆర్థిక, సామాజిక పరంగా ఎన్నో దుష్పరిణామాలు ఉంటాయని అన్నారు. డ్రగ్స్ వినియోగం, రవాణా గురించి తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 14416కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గ్రామ స్థాయిలో యాక్షన్ ప్లాన్ తయారు చేశామన్నారు. డ్రగ్స్ వినియోగం పట్ల ఎన్డీపీఎస్ యాక్ట్ అమలులో ఉన్నదని, కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు పాజిటివ్ ఆలోచనలతో చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. అంతకుముందు మాదక ద్రవ్యాల వాడకంతో జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా పనిచేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు.
మాదక ద్రవ్యాల హానికర ప్రభావాల పట్ల జాగ్రత్తలు, అవగాహన కలిగించే పోస్టర్లను ఆవిషరించారు. కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీలు బీరు మల్లయ్య, అనూరాధ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ జయశ్రీ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదులు, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి రమణి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ పాపారావు, డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ శిల్పి, సైక్రియాటిస్ట్ డాక్టర్ ప్రీతిస్వరూప్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కౌన్సిల్ జయపాల్, కళాశాల ప్రిన్సిపాల్ పాపిరెడ్డి, సఖి ఎన్జీఓ డాక్టర్ ప్రమీల, ఎన్జీఓ కరణ్ పాల్గొన్నారు.