చౌటకూర్, జూన్ 28: సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం శివంపేటలో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేస్తుండడంతో గ్రామంలో సహజ సిద్ధంగా వెలిసిన కొండ లు, గుట్టలు కరిగిపోతున్నాయి. సంగారెడ్డి-నాందేడ్-అకోలా 161 జాతీయ రహదారికి అనుకుని శివంపేట గ్రామం నుంచి మండల కేంద్రం చౌటకూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన వెంచర్లలోని అంతర్గత రహదారుల కావాల్సిన ఎర్ర మట్టిని రాత్రీపగలు అనే తేడా లేకుం డా అక్రమంగా తరలిస్తున్నారు. స్థానికులు అడ్డుకున్నా అక్రమార్కులు ఆగడం లేదు. రెవెన్యూ, పోలీసు అధికారులకు నెలనెలా మామూళ్లు ఇచ్చి దందా నడిపిస్తున్నామని చెబుతున్నారు. జేసీబీల సహాయంతో భారీ టిప్పర్లు, ట్రాక్టర్లలో మట్టిని ఒకచోట డంప్ చేస్తున్నారు. డంప్ చేసిన అనంతరం అక్కడి నుంచి వెంచర్ల నిర్వాహకులతో బేరం కుదుర్చుకుని మట్టిని తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్కు రూ. 5వేల నుంచి రూ.7 వేల వరకు, ఒక్కో ట్రాక్టర్కు రూ. 3వేల నుంచి రూ.4వేల వరకు మట్టిని విక్రయిస్తున్నారు. శివంపేట గ్రామ శివారులో గల కంకర మిషన్ ప్రాంతంతో పాటుగా వీర హనుమాన్ ఆలయ ప్రాంతం లో ఉన్న కొండలు, గుట్టలను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. స్థానికులు అడ్డుకుంటే వారితో దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నా యి. కొండలు, గుట్టల నుంచి తవ్విని మట్టిన తమ కు అనువైన ప్రదేశంతో పాటుగా గ్రామ శివారులో ఈజీఎస్ నిధులతో నిర్మించిన క్రీడా ప్రాంగణంలో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి వెంచర్లకు, సంగారెడ్డి, జోగిపేట తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ మట్టి దందాపై సంబంధిత అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అక్రమంగా మట్టిని తరలించినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో అనుమతులు లేకుండా కొండలు, గుట్టల ను తవ్వితే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. మండలంలో ఎక్కడైనా అక్రమంగా మట్టి ని తరలిస్తే ఫిర్యాదు చేయాలి. అనుమతులు లేకుండా వెంచర్లకు మట్టిని తరలిస్తూ పట్టుబడితే ఆ వాహనాలను సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తాం.
శివంపేట గ్రామ శివారులో మట్టి తరలింపును అడ్డుకోవాలి. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అదే పనిగా మట్టి దందా చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫి ర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. గ్రామ శివారులో ఎక్క డ చూసినా మట్టికుప్పల నిల్వలే కనిపిస్తున్నా యి. అధికారులు స్పందించి మట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి.