సిద్దిపేట, జూలై 02: విద్యాలయాలకు నిలయమైన సిద్దిపేట పట్టణానికి విద్యనభ్యసించేందుకు దాదాపు పరిసర గ్రామాలతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలోని విద్యార్థులు నిత్యం వస్తుంటారు. ఇంతమంది విద్యార్థులకు సిద్దిపేట ఆర్టీసీ డిపో పరిధి నుంచి కేవలం 13 బస్సులు మాత్రమే నడుపుతున్నారు. చాలా గ్రామాలకు బస్సులు రాక విద్యార్థులు కాలినడకన, ప్రైవేట్ వాహనాల్లో బడులకు వెళ్తున్నారు. విద్యార్థులకు కోసం సిద్దిపేట ఆర్టీసీ డిపో 13 బసులు నడుపుతోంది. ఇందులో నంగునూరు మండలంలో 3, చిన్నకోడూరు మండలంలో 2, సిద్దిపేట రూరల్ మండలంలో 3, నారాయణరావుపేట మండలంలో 2 బస్సులతో పాటు సిద్దిపేట-కామారెడ్డి రూ ట్లో, సిద్దిపేట- అర్జునపట్ల, సిద్దిపేట-ధూళిమిట్ట రూట్లలో బసులు నడుపుతున్నది. కానీ, చాలా గ్రామాల్లోకి బస్సులు రాక విద్యార్థులు ఆటోల్లో వెళ్తున్నారు.
కొన్ని గ్రామాల విద్యార్థులు ప్రధాన రహదారికి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చి బస్సు ఎకాల్సిన దుస్థితి ఉంది. బస్సులు వచ్చినప్పటికీ ఆ రూట్లలో విద్యార్థుల సంఖ్య ఎకువగా ఉండడంతో, కొన్ని గ్రామాల స్టేజీల వద్ద బస్సులు ఆపడం లేదు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా బస్సులు నడపాలని విద్యార్థులు కోరుతున్నారు. సిద్దిపేట డిపో పరిధిలో 12 ఏండ్ల వయసున్న విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను ఆర్టీసీ అందించింది. 2023 – 24 విద్యా సంవత్సరంలో ఉచిత బస్సు పాస్లు 5127 మందికి, రాయితీపై బస్సు పాసులు 1737 మంది విద్యార్థులకు అందజేసింది. ఈ సారి జూన్ నెల వరకు ఉచిత బస్సు పాసులు బాలురకు 101 మందికి, రైతు బస్సు పాసులు 1001 మందికి జారీ చేశారు. బాలికలకు ఆధార్ కార్డుతో ఉచిత ప్రయాణం ఉండడంతో బస్సు పాసులు జారీ చేయలేదు.