సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పండ్ల పరిశోధనా కేంద్రంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢ మాసం రెండో ఆదివారం సందర్భంగా బోనాల పండుగ నిర్వహించారు. స్థానికులు బోనాలు ముస్తాబు చేసి ఉరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. అక్కడున్న దేవాలయాల్లో కొలువైన దేవతా మూర్తులను దర్శించుకున్నారు. కొబ్బరికాయలు, జంతుబలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం చెట్లకింద వంటా వార్పు చేసుకుని వన భోజనాలు చేశారు. అక్కడున్న చెట్లకు ఊయలు కట్టుకుని ఊగుతూ చిన్నపిల్లలు ఆనందంగా గడిపారు.
– సంగారెడ్డి ఫొటోగ్రాఫర్, జూలై 2