చిన్నకోడూరు, జూలై 1 : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు వైద్యులకు సూచించారు. సోమవారం చిన్నకోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హరీశ్రావు సందర్శించారు. దవాఖానలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఓపీ, ఏఎన్సీ చెకప్లు, ఫార్మసీలో అందుబాటులో ఉన్న మందులు, డయాగ్నోస్టిక్లో అందుతున్న సేవలను పరిశీలించారు. వానకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున అవసరమైన మందులు, ల్యాబ్ పరికరాలు ఉండేలా చూడాలన్నారు. డెంగీ, మలేరియా కేసులు ఎన్ని వస్తున్నాయి. ఎలాంటి చికిత్స అందిస్తున్నారనే విషయాలను డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఏఎన్ఎం, సిబ్బందితో సుదీర్ఘంగా హరీశ్రావు చర్చించారు. ఉచిత పరీక్షలు నిర్వహించే డయాగ్నోస్టిక్ సెంటర్ల సేవలు పేషెంట్లకు అందించాలని, వీలైనంత తర్వగా రిపోర్టులు తెప్పిం చి తగు వైద్యం అందించాలన్నారు. కార్యక్రమంలో వైద్యురాలు సరిత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాముని శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఉమేశ్చంద్ర, సిబ్బంది ఉన్నారు.