రామాయంపేట, జులై 2: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని దంతెపల్లి, పర్వతాపూర్, లాక్య తండా, సుభాష్తండా, తీన్నెంబర్ తండా, బాపనయ్య తండా, బాల్య తండాల విద్యార్థులు పదుల సంఖ్యలో కాట్రియాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. వీరికి బస్సు సౌకర్యం ఉన్నా సమయపాలన పాటించక పోవడంతో కాలినడకన వెళ్తున్నారు. ఉదయం 8గంటలు, సాయంత్రం 6.30 గంటలకు బస్సు వస్తున్నది. ఇది వీరికి అనుకూలంగా లేదు. దీంతో విద్యార్థులు వారి గ్రామాల నుంచి బ్యాగుల మోతతో 7కిలోమీటర్లు కాలినడకన రాకపోకలు సాగిస్తున్నారు. నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలకు చుట్టుపక్కల గిరిజన తండాలు, గ్రామాల నుంచి కాలినడకన, ప్రైవేట్ వాహనాల్లో విద్యార్థులు వస్తున్నారు.
విద్యార్థులు పాఠశాలకు వచ్చే సమయాల్లో ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపిస్తే విద్యార్థులకు ఇబ్బందులు ఉండవు. మేము కూడా విద్యార్థులకు మంచి చదువులు అందించగలుగుతాం. సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులు కాలినడకనే బడికి వస్తున్నారు. దీంతో వారు టైమ్కు బడికి చేరుకోలేక పోతున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆర్టీసీ అధికారులు ఉదయం బడి సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలి. ఉదయం 9గంటలకు మా గ్రామానికి బస్సు వస్తే పర్వతాపూర్ నుంచి కాట్రియాలకు ప్రార్థన సమయంలో చేరుకుంటాం. ప్రతిరోజు బస్సులు సమయానికి రాక కాలినడకతోనే స్కూల్కు వెళ్తున్నాం.