మెదక్ జిల్లా : పాఠశాలలో ఉపాధ్యాయుల (Teachers) కొరతను తీర్చాలని మెదక్ జిల్లా చిన్న శంకరపేట్ గ్రామం శాలిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు(Students), తల్లిదండ్రులు(Parents) రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డుపైనే వంటవార్పు చేసి ప్రభుత్వానికి నినాదాలు చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు వచ్చేవరకు రోడ్డుపై నుంచి జరిగేది లేదంటూ భీష్మించుకుని రోడ్డుపై కూర్చున్నారు.
శాలిపేట ప్రాథమిక(Primary), ఉన్నత పాఠశాల(High Schools) లో ఇద్దరు మాత్రమే స్కూల్ అసిస్టెంట్లు (School Assistance) ఉన్నారని, విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేరని వాపోయారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యాబోధన సక్రమంగా కొనసాగేటట్టు చూడాలని గవలపల్లి, రామాయంపేట రోడ్డుపై ప్లకార్డులతో నిరసన తెలిపారు.