చేర్యాల, జూలై 1: మండలంలోని ఆకునూరు ప్రాథమిక పాఠశాలలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ మంచిగా చదువుకోవాలని సూచనలు చేస్తూ వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. ఒక్కసారిగా విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దకెళ్లి సార్ మీరు పోవద్దు..మాతోనే ఉండాలి..మీరే మాకు పాఠాలు చెప్పాలంటూ కన్నీరు పెట్టుకున్నారు.123 మంది విద్యార్థులు చదువుకుంటున్న ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయులు తాటికొండ యాదయ్య, గొం టి బుచ్చయ్య, అక్కెనపల్లి ఇంద్రాసేనారెడ్డి, ఉప్పల భాస్కర్, కామిడి రత్నమాల పని చేస్తున్నారు. వీరిలో మెడిచెల్మి అయోధ్యకు ప్రమోషన్ రావడంతో ఇదే పాఠశాలలో హెచ్ఎంగా బాధ్యతలు స్వీకరించారు. కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రీడలు, పాటలు, కోలాటం తదితర కార్యక్రమాలు నేర్పించడమే కాకుండా విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి అభ్యున్నతికి కృషి చేస్తుండడంతో విద్యార్థులకు, ఉపాధ్యాయుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది. బదిలీపై వెళ్తుండడంతో జీర్ణించుకోలేని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకోవడంతో వీడ్కోలు కార్యక్రమానికి వచ్చిన సుమారు 50 మంది తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యా రు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ తోళ్ల రాజేశ్వరి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు అందె అశోక్ తదితరులు ఉపాధ్యాయులను సన్మానించారు.