కంది, జూలై 4: ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డిలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అధ్యక్షతన జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథులుగా మంత్రి దామోదర రాజనర్సింహ, కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీల సమక్షం లో శాఖలవారీగా జరిగిన అభివృద్ధి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా విద్య, వైద్యం, పారిశ్రామిక రం గాల్లో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజల అభివృద్ధికి స్పష్టమైన దృక్పథంతో ముందుకు సాగితే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.
ఉన్న నిధులను సద్వినియో గం చేసుకొని చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరుగకుండా పనిచేసిన ఎంతోమంది నాయకులు ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకొని ప్రజాప్రతినిధులు అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. మారుమూ ల గ్రామాలకు నలువైపులా రోడ్డు సౌకర్యాలు కల్పిస్తే కనెక్టివిటి పెరిగి గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. సంగారెడ్డికి రింగ్ రోడ్డు అవసరం ఉందని, ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రింగ్ రోడ్డుకు ఎంపీలు సహకరించాలన్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత ఉందని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకురాగా, స్పందించిన మంత్రి మందుల కొరత లేకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టా న్ని అభివృద్ధి పథంలో నడిపి కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీజైపాల్రెడ్డి మాట్లాడుతూ ఐదేండ్ల పదవీకాలంలో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశానన్నారు. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పదవీకాలం ముగిసిన జడ్పీ చైర్మన్, జడ్పీటీసీలు, ఎంపీపీలను శాలువాలతో సత్కరించారు. అంతకుముందు జడ్పీ ఆవరణలో దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా మంత్రి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మెదక్, జహీరాబాద్ ఎంపీలు రఘునందన్రావు, సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, వాకిటి సునీతాలక్ష్మారెడ్డి, మాణిక్రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీసీఈవో జానకిరెడ్డి పాల్గొన్నారు.
రహదారులు, సబ్ సెంటర్లకు నిధులు మంజూరు చేయాలి ; – ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
రహదారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సబ్ సెంటర్లకు కావాల్సిన నిధు లు మంజూరు చేయాలి. సంగారెడ్డి పట్టణంలో ఆరు సబ్ సెంటర్ల నిర్మాణ పను లు పూర్తయ్యాయని, మరో ఆరు సబ్ సెంటర్ల పనులు ప్రారంభం కాలేదు. సబ్ సెంటర్లు పూర్తి చేసేందుకు రూ.20లక్షల నిధులు సరిపోవడం లేదని, సరిపడా నిధులు మంజూరు చేయాలి. సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామం నుంచి పొట్టిపల్లి క్రాస్రోడ్, ఎటిగడ్డసంఘం, మలాపాడు గ్రామాల మీదుగా సింగూర్ వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయమైంది. ఈ రహదారి మరమ్మతులకు సత్వరం నిధులు కేటాయించాలి. సంగారెడ్డికి కూతవేటు దూరంలో ఉన్న మం జీరా ప్రాంతానికి నిధులు కేటాయించి పర్యాటక ప్రాంతంగా మార్చాలి.