చేర్యాల, జూలై 4 : చేర్యాల ప్రాంత ప్రజలు తనను అక్కున చేర్చుకుని ఎమ్మెల్యేగా గెలిపించారని, ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. చేర్యాలలోని భద్రకాళీ గార్డెన్స్లో గురువారం ఎఎంపీడీవో మహబుబ్ అలీ అధ్యక్షతన నిర్వహించిన ఎంపీటీసీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవలో రాజకీయ నాయకులు నిమగ్నం కావాలన్నారు. జనగామ,చేర్యాల ప్రాంతాల అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తున్నానన్నారు. మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, మీతో పాటు గులాబీ శ్రేణులను తాను కంటికి రెప్పల కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు.
తన సొంత దవాఖానలో ఉచితంగా వైద్యసేవలు అందిస్తానని, మీ గ్రామాలకు కావాల్సిన వసతులు, సదుపాయాలు కల్పించేందుకు ముందుంటానని తెలిపారు.గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు. అనంతరం ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్రెడ్డి, ఎంపీటీసీలను ఎమ్మెల్యే సన్మానించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, ఫ్లోర్ లీడర్ మం గోలు చంటి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అనంతుల మల్లేశం, ముస్త్యాల నాగేశ్వర్రావు,మేక సం తోష్, మంద యాదగిరి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల్నర్సయ్య, అంకుగారి శ్రీధర్రెడ్డి, తాడెం రంజిత కృష్ణమూర్తి, సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, పచ్చిమడ్ల మానస, శివగారి అంజయ్య, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జింకల పర్వతాలుయాదవ్, గదరాజు చందు తదితరులున్నారు.
పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తా..
గ్రామాల్లో ఎంపీటీసీల సేవలు మరువలేనివని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నాడు. గురువారం కొమురవెల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తలారి కీర్తనాకిషన్ అధ్యక్షతన జరిగిన ఎంపీటీసీల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. ఎంపీటీసీలకు గౌరవ వేతనం రూ.5వేలు చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి చేయూత అందిస్తానన్నారు. కొమురవెల్లికి తొలి ఎంపీపీని కావడం గర్వంగా ఉందని ఎంపీపీ తలా రి కీర్తన అన్నారు. తనకు బీ ఫారంతో పాటు తన గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురైంది. అనంతరం ఎంపీపీ తలారి కీర్తనాకిషన్, జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్రెడ్డితో పాటు ఎంపీటీసీలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఘనంగా సన్మానించాడు. కార్యక్రమంలో ఎంపీడీవో కుమారస్వామి, మండల ప్రత్యేకాధికారి జి.సరోజన, ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షుడు సాయిమల్లు తదితరులు పాల్గొన్నారు.