మద్దూరు(ధూళిమిట్ట), జూలై 3: జనగామ నియోజకవర్గానికి న్యాయంగా దక్కాల్సిన నిధుల కోసం రాజీలేని పోరాటం చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సభ్యుల పదవి విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ఎలాంటి వివక్ష లేకుండా సీడీఎఫ్ నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నట్లు తెలిపారు. తన నీలిమా దవాఖాన ద్వారా రాజకీయపార్టీలకతీతంగా నియోజకవర్గంలోని ఎంతోమందికి ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యా, వైద్యం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి మద్దూరు మండలం చైతన్యానికి ప్రతీక అని కొనియాడారు. నాటి సాయుధ రైతాంగ పోరాటం, నక్సలైట్ ఉద్యమాలతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమానికి మద్దూరు నేల ఊపిరిపోసిందన్నారు. ఐదేండ్లపాటు ప్రజాప్రతినిధులుగా ప్రజా సేవకు అంకితమైన ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పదవి విరమణ పొందిన ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ గిరి కొండల్రెడ్డి, వైస్ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, ఎంపీటీసీలు చెట్కూ రి కల్యాణీకమలాకర్, బొప్పె కనకమ్మనాగయ్య, గూళ్ల సత్యకళాఆనందం, ఇస్లావత్ నముక్, గుజ్జుక సమ్మయ్య, ఇర్రి రాజేశ్వర్రెడ్డి, నందనబోయిన నర్సింహులు, కూరెళ్ల రాజుగౌడ్, కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ జిలానీలను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారిణి రాధిక, తహసీల్దార్ సంజయ్కుమార్, ఎంపీడీవో రామ్మోహన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చిన్న వయస్సులోనే తనకు కొమురవెల్లి ఆలయ చైర్మన్గా, మద్దూరు ఎంపీపీగా అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి, మాజీ సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటానని మద్దూరు ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఐదేండ్లలో ఉమ్మడి మద్దూరు మండల అభివృద్ధికి అప్పటి రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్రావుతో రూ. 8కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారి మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని ఎంపీపీ సన్మానించారు. అం తకు ముందు మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు వివిధ సమస్యలపై అధికారులను నిలదీశారు. సమావేశంలో జడ్పీటీసీ గిరి కొండల్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి రాధిక, తహసీల్దార్ సంజయ్కుమార్, ఎంపీడీవో రామ్మోహన్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.