రాయపోల్, జూలై 1 : కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పేద విద్యార్థులు ఉన్నతమైన స్థానాలు అధిరోహిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం రాయపోల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమ్మన భాస్కర్రెడ్డి ఉద్యోగ విరమణలో పాల్గొని మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నేడు ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నట్లు గుర్తు చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రభు త్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల పదోతరగతి పరీక్షల్లో మం డలవ్యాప్తంగా వందశాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చది వి పాఠశాలలకు, తల్లిదండ్రులకు, గ్రామాలకు మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు.
రాయపోల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్రెడ్డి విద్యార్థులకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమలు ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, జడ్పీటీసీ యాదగిరి, ఎంపీపీ కల్లూరి అనితాశ్రీనివాస్, ప్రజాయిత ఫౌండేషన్ చైర్మన్ మామిడి మోహన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మనోహర్రావు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రవీందర్రెడ్డి, తెలంగాణ అమరవీరుల స్మారక రూప శిల్పి రమణారెడ్డి, తహసీల్దార్ దవ్య, ఎంపీడీవో బాల య్య, ఎంఎన్వో సత్యనాయణరెడ్డి, అమ్మ అదర్శ కమిటీ చైర్పర్సన్ లావణ్య, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శశిధర్ శర్మ, టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు తిరుపతిరెడ్డి, కొండల్రెడ్డి, రాంచంద్రం, కనుక య్య, వివిధ గ్రామల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.