కోహెడ జూలై 3: ప్రజాసేవే మళ్లీ గెలిపిస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం కోహెడ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల వీడ్కోలు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు. పంచాయతీ రాజ్, రోడ్లు, భవనాల శాఖ, మిషన్ భగీరథ శాఖలపై సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజక వర్గం అభివృద్ధిలో పరుగులు పెట్టాలన్నారు.
కష్టపడిన వారు బయపడేది లేదని, వారిని మళ్లీ ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు. వంట గ్యాస్, విద్యుత్ బిల్లులు మాఫీకావటం లేదని ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకురాగా త్వరలో సమీక్ష జరిపి ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేస్తానన్నారు. ప్రజాప్రతినిధులు పదవి పోయిందని బాధపడొద్దని, నిత్యం ప్రజాసేవలో ఉండాలన్నారు. అనంతరం ఎంపీపీ కొక్కుల కీర్తీసురేశ్, జడ్పీటీసీ నాగరాజు శ్యామలామధుసూదన్రావు, ఎంపీటీసీలను శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఎంపీటీసీలు, అధికారులు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కీర్తి, జడ్పీటీసీ నాగరాజు శ్యామల, వైస్ఎంపీపీ తడ్కల రాజిరెడ్డి, సీనియర్ నాయకులు కర్ర శ్రీహరి, కొక్కుల సురేశ్, ఎంపీటీసీలు, తహసీల్దార్ సురేఖ, ఎంపీడీవో కుమా ర్, వివిధ శాఖల అధికారులు, పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.